ప్రముఖ మ్యూజిక్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న నిరోష(23) ఈ ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్లోని సింధికాలనీలో గల మహిళా వసతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటున్న ఆమె.. ఓ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిరోషా స్వస్థలం చిత్తూరు జిల్లా సోమల మండలం మల్లేశ్వరపురం గ్రామం. సికింద్రాబాద్లోని సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్లో బుధవారం రాత్రి ఉరివేసుకుని నిరోషా ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నిరోషా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తెలుగు ఛానల్స్లో ఓ మ్యూజిక్ ఛానల్లో నిరోషా యాంకర్గా పనిచేస్తుంది. మ్యూజిక్ ఛానల్కు మరో యాంకర్తో కలిసి నిరోషా సికింద్రాబాద్లోని సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్ ఉంటోంది. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిశ్చితార్థం జరిగిన యువకుడితో మాట్లాడినట్లు తన తోటి యాంకర్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాత్రి ఫోన్ లో మాట్లాడినప్పుడే ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగిందనీ,ఈ క్రమంలో తన అతన్ని బెదిరించాలనే ఉద్దేశంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఉరివేసుకున్న హుక్ బిగుసుకుపోవడంతోనే ఆమె చనిపోయినట్లు ఆమె రూంమేట్గా ఉన్న మరో యాంకర్ చెప్పారు. యాంకర్ నిరోషా తల్లిదండ్రులు బెంగుళూరులో ఉన్నారు. కుమార్తె ఆత్మహత్య విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్కు బయల్దేరారు. ప్రస్తుతం ఆమె కాబోయే భర్త ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు నెల రోజుల్లోనే పెళ్లి కావాల్సి ఉంది. ఇప్పటికే ఎంగేజిమెంట్ కూడా అయ్యింది. ఆమె వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి.. కాల్ పెట్టేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే.. నెల రోజుల్లోనే పెళ్లి జరగాల్సి ఉండగా ఇప్పుడు ఎందుకు తిరస్కరించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కారణాలేవైనా.. ఇప్పుడిప్పుడే మంచి యాంకర్ గా ఎదురుగుతున్న నిరోషా ఇలా చిన్న గొడవతో ఆత్మహత్య చేసుకోవటం మాత్రం బాధాకరం..