Home / Political / ఆంద్రప్రదేశ్ లో రూ.3కే టిఫిన్ మరియు రూ.7కే భోజనం.

ఆంద్రప్రదేశ్ లో రూ.3కే టిఫిన్ మరియు రూ.7కే భోజనం.

Author:

పేదలు ఖాళీ కడుపుతో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అన్నా క్యాంటీన్’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమరావతిలో ప్రారంభించారు. ఈ ‘అన్నా క్యాంటీన్’లో ప్లేట్ ఇడ్లీ రూ.3, ఉప్మా, పొంగలి రూ.5 మరియు భోజనం రూ.7లకు అందించనుండగా.., ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వంటల యొక్క రుచి చూసి, కాసేపు అందరికి వడ్డించారు. ప్రతిరోజు 500 మందికి తగ్గకుండా అల్పాహారం, భోజనం అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ క్యాంటీన్ లను ఇస్కాన్ సంస్థ వారు నిర్వహించనున్నారు.

anna canteens opened in AP

తొందరలొనే రాష్ట్రం మొత్తం ఈ క్యాంటీన్ లు రానున్నాయి. ఇలాంటి పథకమె హైదరాబాద్ లో నగర పాలక సమితి నిర్వహిస్తోంది. కేవలం 5 రూపాయలకే మంచి భోజనం అందిస్తుండడంతో దానికి కూడా మంచి పేరు వచ్చింది. ఇలాంటి మంచి పథకాలు మంచిగా నిర్వహించబడి ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టగలిగితే అదే 10 వేలు.

(Visited 655 times, 1 visits today)