ఒకప్పుడు కృష్ణవంశీ అంటే తెలుగు లో టాప్ డైరెక్టర్లలో ఒకరు. మూస పద్దతిలో కొట్టుకుపోతున్న టాలీవుడ్ ను తన క్రియేవిటీతో కొత్త పుంతలు తొక్కించాడు.రొటీన్ కి భిన్నంగా ఉండే కథలని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పడానికి ట్రై చేయడమే కాకుండా గులాబి, సింధూరం, అంతఃపురం, ఖడ్గం, మురారి లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. కొన్నాళ్ల పాటు వంశీ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. భారీ ఖర్చుతో ఆయన వేయించే సెట్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి.
అయితే ఇప్పుడు కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రాన్ని ఆయన నిర్మించటానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో ఆ చిత్రం సాగనుంది. ప్రకాష్ రాజ్ కు, దిల్ రాజు కు ఉన్న అనుబంధంతో ఈ చిత్రం ప్రొడ్యూస్ చేస్తారని చెప్పుకుంటున్నారు. తమిళ,తెలుగు భాషల్లో రూపొందనుందని తెలుస్తోంది.అనుష్క కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంకి బాహుబలి పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలవుతుంది కానీ అనుష్క రెండు సినిమాలకు తగ్గట్టుగా డేట్స్ అడ్జస్ట్ చేసుకోగలను అని చెప్పడంతో ఫిబ్రవరి నుంచి కృష్ణవంశీ సినిమా మొదలెట్టేలా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్కతో పాటు 5 మంది హీరోస్ కూడా కనిపిస్తారని, దాని కోసం సెలక్షన్ కూడా నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ హర్రర్ సినిమా కథకి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నారని తెలుస్తుంది.
కాని రుద్రాక్ష అనే టైటిల్ ఇప్పటికే ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కాగా, అప్పట్లో రఫ్ చిత్రాన్ని రూపొందించిన సిహెచ్ సుబ్బారెడ్డి ’రుద్రాక్ష’ అనే పేరుతో ఇటీవల ఓ చిత్రాన్ని ప్రారంభించారు. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా తాజాగా విడుదల చేసారు. టైటిల్ మారుస్తారో లేక ఇదే టైటిల్ ని పెట్టెస్తారో చూడాలి.