ఫేస్ బుక్, ట్విట్టర్ లేదా ఇంకా ఎదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఒపెన్ చేసినా ఒకటే మెసేజ్ దర్శనం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ బాగు కోరుకునే వాడివైతే కులానికి, మతానికి, పార్టీలకు అతీతంగా కదిలిరా విశాఖ తీరానికి అన్నది ఆ మెసేజ్ సారంశం. జల్లికట్టు మీద సుప్రీం కోర్టు నిషేదం విధించినా కూడా వెనకడుగు వేయకుండా తమిళ యువత చేపట్టిన శాంతియుత నిరసనను స్పూర్తిగా తీసుకొని ఆంధ్ర యువత కూడా నవ్యాంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం జనవరి 26 న వైజాగ్ బీచ్ లో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఏలా నిరసన తెలపాలన్నది ఎవరికి తెలియక పోయినా ముందుగా అందరూ 26న విశాఖ తీరానికి చేరాలన్న మెసేజ్ అందరికి చేరింది.
ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా యువత చేయబోవు నిరసనకు తమ మద్దతు ఉంటుందని ట్విట్టర్లో ప్రకటించడంతో ఇప్పుడు ఈ విషయం ఇంకోంచం సీరియస్ గా మారింది. ఇప్పుడిప్పుడే యువ తెలుగు హీరోలు కొందరు ఆంధ్ర యువత ఆందోళనలకు తమ మద్దతు ఉంటుందని కుదిరితే తాము కూడా వైజాగ్ వస్తామని ప్రకటిస్తుండడంతో ఇక 26 న విశాఖ లో ఎం జరగబోతుందో అన్నది అందరికి ఉత్కంట గా మారింది. ఏది ఏమైనా నవ్యాంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర యువత అంతా కదిలితే అది తప్పక సిద్దిస్తుంది.
#APDemadsSpecialStatus ,If youth of AP are planning to do a silent protest on 26th Jan at RK Beach , Vizag, #Janasena Supports them.
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2017
#APDemandsSpecialStatus pic.twitter.com/NcAfOro0i3
— Pawan Kalyan (@PawanKalyan) January 23, 2017