ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి రోజు ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. కాని ఎప్పుడైనా ఒక అమ్మాయి, అబ్బాయిపై యాసిడ్ తో దాడి చేయడం చూసి ఉండరు. అలాంటి పిచ్చి పనే చేసి కటకటాలు లెక్కపెడుతుంది బెంగళూరు కి చెందిన లిదియా. బెంగళూరులో నివాసం ఉంటున్న 26 యేళ్ళ లిదియాకు మరియు భాదితుడు 32 యేళ్ళ జయకుమార్ లు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వేరు వేరు మతాలకు చెందిన వీరి వివాహానికి మతం అడ్డంకిగా మారింది. తమ మతంలోకి మారి తనను పెళ్ళి చేసుకోవాలని జయకుమార్ ని అడిగింది లిదియా. పెళ్ళి చేసుకోవడం ఇష్టమే కాని తాను మాత్రం మతం మారనని వాధించాడు జయకుమార్. దీనితో వారిద్దరు మధ్య వాదన పెద్దదై ఇవువురు 6 నెలల క్రితం విడిపోయారు. ఇప్పుడు జయకుమార్ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని తెలుసుకున్న లిదియా అతనిపై పగపట్టి గత సోమవారం బెంగళూరులో అతని మొఖంపై యాసిడ్ పోసింది. అంతే కాకుండా తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన జయకుమార్ పై కత్తితో కూడా దాడి చేసింది. ఈ దాడికి లిదియా చేసుకున్న ప్రిపరేషన్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.. ఆ ప్రిపరేషన్ ఎంటో క్రింద చదవండి.
జయకుమార్ పై దాడి చేయాలనుకున్న లిదియా ముందుగా తన బండి నంబర్ కనపడకుండా స్టిక్కర్లు అంటించింది. శరీరం పూర్తిగా కవర్ అయ్యేలా బట్టలు, హెల్మెట్ ధరించింది. తను నర్స్ గా పనిచేస్తున్న ఆసుపత్రి నుండి ఒక కత్తి, యాసిడ్ బాటిల్ తెచ్చుకొని జయకుమార్ ఇంటి దగ్గర ఎదురు చూసింది. తన అన్నతో కలిసి బండి మీద ఇంటికి వచ్చిన జయకుమార్ మొఖంపై మొదట యాసిడ్ పోసి పారి పోవాడానికి ప్రయత్నించింది. తన మొఖం కాలుతున్న అలాగే లిదియా ను వెంబడించి పట్టుకున్నాడు జయకుమార్. ఆ సమయంలోనే తన దగ్గర ఉన్న కత్తితో మరోసారి జయకుమార్ పై దాడి చేసింది లిదియా. ఆ దాడినుండి తేరుకున్న జయకుమార్ మరియు అతని అన్న, లిదియాను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు లిదియాపై కేసు నమోదుచేసి లోపలేశారు, జయకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.