అతని పేరు సందీప్ కుమార్ ఇతని మొత్తం ఆస్తి ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 లక్షలు. మార్కెట్ విలువ మాత్రం దానికి రెట్టింపే ఉండొచ్చు, ఉంటుంది కూడా. ఈయన రోజుకి రూ/- 2500-3000 సంపాధిస్తాడు. నెలకు ఇతని ఆదాయం 75000 పై మాటే. ముంబయ్ లోని పరేల్ ప్రాంతంలో ఇతనికి రెండు ఫ్లాట్లున్నాయి వాటిని అద్దెక్కిచ్చాడు. ఈయనకు మరో షాప్ కూడా ఉంది అది కూడా అద్దెకిచ్చాడు. వీటిద్వారా మరో రూ 63000 రూపాయల వరకూ ఉంటుంది. ఇంతకీ సదరు సందీప్ కుమార్ ఏం చేస్తూంటాడూ అని ఆలోచిస్తున్నారా.!? హైదరాబాద్ జూబ్లిహిల్స్ చౌరస్తా లో అడుక్కుతింటాడు. మీరు చదివింది నిజమే అతని వృత్తి అడుక్కోవటమే…
రెండ్రోజుల కింద అర్థ రాత్రి తాగి రోడ్డు మీద తిరుగుతున్న ఇతన్ని పోలీసులు తనిఖీ చేస్తే 20000 రూపాయలు బయట పడటంతో అతన్ని అనుమానించి ప్రశ్నించగా ఈ వివరాలన్నీ వెలుగులోకొచ్చాయి. అతని ద్వారా కొన్ని విషయాలు విన్న హైదరాబాద్ పోలీసులకే కళ్ళు తిరిగిపోయాయి , హైదరబాద్ ఇప్పుడు యాచకులకు ప్రధాన అడ్డాగా మారింది. ఇతర రాష్ట్రాలనుంచి కుటుంబాలకు కుటుంబాలే వచ్చి ఇక్కడ అడుక్కుంటున్నారు. వీళ్ళలో కొందరి సీజనల్ బిచ్చగాళ్ళు కేవలం. పండగల టైం లో వచ్చి వెళ్ళిపోతూంటారు. అడుక్కోవటం కోసం వీళ్ళు పసివాళ్ళని పిల్లలని దారుణం గా హింసించటానికీ, వాళ్ళకి మత్తు మందులివ్వటానికీ వెనకాడటం లేదు. సొంతరాష్ట్రాల్లొ ఆస్తులు కూడబెట్టుకొంటూ ఇక్కడ పుట్ పాత్లపై పడుకుంటూ బతుకుతున్నారు. సోమరిగా డబ్బు సంపాదించటానికి అలవాటు పడిన వీళ్ళు. డబ్బు దొరకని రోజుల్లో దొంగతనాలకు తెగబడ్డా ఆశ్చర్యం లేదు.