ఈమె పేరు బిందుప్రియ, ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందినది. తనకు ఇద్దరు తోబుట్టుబువులు ఉన్నారు, తన కుటుంబాన్ని తానే పోషిస్తుంది. ఒక పక్క ఎనిమిదో తరగతి చదువుతూ, మరోపక్క కులవృత్తిని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తను ఇలా కులవృత్తి చేయటం వెనక విషాద గాధ ఉంది. బిందు ప్రియ తండ్రికి స్వతహాగా క్షౌర శాల ఉంది, దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. వైద్యులు తన తండ్రి మెదడులో కణితి ఉందని తేల్చడంతో కుటుంబ సభ్యులంతా భయంతో వణికిపోయారు. కాని, వయస్సులో చిన్నది మరియు ఆడపిల్ల అయిన బిందు ప్రియ తన ధృడ నిశ్చయంతో తమ కుల వృత్తిని కొనసాగిస్తూ, తన కుటుంబాన్ని పోషిస్తుంది.
ధృడమైన పట్టుదల ఉంటే ఏమైనా చేయవచ్చని చెప్పడానికి ఈ బిందుప్రియ చక్కని ఉదాహరణ. “కంటే కూతురినే కనాలి” అనే మాటకి గొప్ప నిదర్శనం మన బిందుప్రియ.