Home / Videos / రాజకీయ నాయకుల ఫోటువల మీద చర్చ పెట్టి పిస్తా అంటున్న సత్తి.

రాజకీయ నాయకుల ఫోటువల మీద చర్చ పెట్టి పిస్తా అంటున్న సత్తి.

Author:

ఆంద్ర అసెంబ్లి దగ్గరికి పోయి జనన్, చిరంజీవిల తోటి చంద్రబాబు దిగిన పోట్వలను తీసుకోని ఇగా వాటి పైన చర్చ జరిపియ్యమని వై సి పి యం.యల్.ఎ. రోజా మేడంకి ఇవ్వడానికి పొయ్యిండు. అయిన తుఫేల్ గాళతోటి ఫోతోలు దిగి అంసెబ్లిలా పంచాయితీ పెట్టుకుంటుండ్రు, అసలైన ఫోటువలు చూపిస్తే ఆసేంబ్లి అంత ఆగం అయితది, మస్తు కొట్లాడుకుంటారు అంటూ అందరి ఫోటువలు సూపిస్తుండు.. ఎట్లాయిన వీటి మీద చర్చ పెట్టాలని అంటుండు. అట్లా పెట్టరు తమ్మి అంటే, కాల్ మని కేసుల చంద్ర బాబు తోటి దిగినోల్లు ఉన్నరని దానిమీద చర్చ పేట్టుమంటా లేరా అంటుండు. అవులగాలు పొయ్యి ఫోట్వలు దిగితే,అవులగాలు మంచోల్లు కారు మంచోల్లు అవులగాండ్లు కాదు అంటుండు. కాల్ మని కేసుల ఉన్నోల్ల లఫుట్ గాళని లాగులు పలుగోట్టక! వీళ్ళూ పంచాయితి పెట్టుకుంటరు…

అట్లా కాదు తమ్మి ఆంద్రలా కమ్మటి రాజ్యాకీయ్యాలు ఉంటయ్, ఎమైన కూడా కాపుగాసి సెటిల్జేసే వాల్లు ఉంటారు గవన్ని నీకు అర్ధం కావు అంటే కమ్మగా కూర బువ్వనే ఉంటాది అనుకున్న, రాజ్యకీయాలు కూడా కమ్మగా ఉంటయని తెల్వక!

తమ్మి రాజాకియ్యలల్ల మొకాళుకు పుండు పుడితే మొకానికి మందు రాస్తారు అంటే, ఈ ఫోటువల జగుడం చూసినంక నాకు గులు అయితంది అంటుండు. ఎందుకు తమ్మి అంటే ఆఫీస్ కాడ అందరు నాతోటి ఫోటువలు దిగుతరు కద! మళ్ళ వాల్లు ఎడన దోంగతనం చేసి దొరికి ఎవరేవరు చేసిండ్రు చెప్పుర అంటే నా ఫోటువ చూపిస్తే ఎట్లా ఈ కాల్ మని లెక్క చేతిమని ఎమన్న అయితే అంటుండు.

(Visited 106 times, 1 visits today)