సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత ఇలా మొదటి సారి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రన్ని పీవీపీ సంస్థ భారీ బడ్జెట్తో సినిమాను నిర్మిస్తోంది.
జనవరి 1న విడుదలైన టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఇప్పటికే 80% పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తుతం వారణాసిలో ఓ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో మహేష్, సమంతలతో పాటు ఇతర తారాగణం పాల్గొంటుండగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొద్దిరోజుల పాటు వారణాసి, ఢిల్లీ, డెహ్రడూన్ లాంటి నార్త్ ఇండియన్ ప్రాంతాల్లోనే ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ జరగనుంది.