Home / General / పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వేరువేరుగా జంప్…! పూజారి మిగిలిపోయాడు..!

పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వేరువేరుగా జంప్…! పూజారి మిగిలిపోయాడు..!

Author:

వధూవరులతో పాటు చుట్టాలు, శ్రేయోభిలాషుల మధ్య సందడి సందడిగా ఉండాల్సిన పెళ్లి మండపంలో అందరు తలోదారిన వెళ్లిపోవడంతో చివరికి పూజారి ఒక్కడే మిగిలిపోయిన వింత సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది, కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని చన్నకల్లు గ్రామానికి చెందిన గురేష్, బంగారుపేట తాలూకా నేర్నహళ్లి గ్రామానికి చెందిన సౌమ్యలకు శనివారం రోజు నిశ్చితార్ధం, ఆదివారం(జనవరి 28 ) పెళ్లి జరగాల్సి ఉంది పెళ్లికి మాలూరు అనే గ్రామంలో ఉన్న పద్మావతి కళ్యాణ మంటపంలో అన్ని ఏర్పాట్లు చేసారు. ఇరు కుటుంబాలకి చెందిన బంధువులు పెళ్లి మంటపానికి వచ్చారు. పురోహితుడు పెళ్లి జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

bride and groom jump separately in karnataka

శనివారం రాత్రి నిశ్చితార్థ సమయానికి వధువు సౌమ్య కళ్యాణ మంటపానికి రాలేదు. తను ప్రేమించిన వ్యక్తితో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. దీంతో పెళ్లి కూతురు తరపు వారితో.. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం, ఘుర్షణ జరిగింది, అయితే అదే ముహూర్తానికి సౌమ్య చిన్నాన్న కూతురు వెంకటరత్నమ్మతో గురేష్‌ వివాహం చేయాలని నిర్ణయించారు. రెండు కుటుంబాలు అంగీకరించాయి. నిశ్చితార్థం కూడా జరిగింది. అంతా సుఖాంతం అనుకుంటున్న సమయంలో ఆదివారం పెళ్లి సమయానికి వరుడు గురుష్ జంప్ అయ్యాడు. కటింగ్ షాప్ కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లి..మళ్ళీ పెళ్లి మండపానికి తిరిగి రాలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసాడు, దీంతో కల్యాణ మంటపంలో మళ్లీ గందరగోళం నెలకొంది, వరుడు తిరిగి రాకపోవడంతో పెళ్లికి వచ్చిన వారు వెళ్లిపోయారు. వరుడి వేటలో అబ్బాయి తరపు వారు వెళ్లారు. రెండుసార్లు పెళ్లి ఆగిపోయిందనే మనోవేదనతో అమ్మాయి తరపు వారు ఇంటికెళ్లిపోయారు. ఎవరిదారిన వారు వెళ్లిపోవటంతో..మండపంలో ఒంటరిగా మిగిలిపోయాడు పూజారి. చేసిన వంటలు కూడా వేస్ట్ అయిపోయాయి. ట్విస్ట్ లపై ట్విస్టులతో 24 గంటలు సాగిన హైడ్రామా.. కర్నాటకలో చర్చనీయాంశం అయ్యింది.

(Visited 872 times, 1 visits today)