జియో ఉచిత ఆఫర్లు మార్చి 31 న ముగుస్తుండడంతో దానిని ధీటుగా ఎదుర్కునేందుకు మిగతా నెట్ వర్కులు సిద్దమవుతున్నాయి. ఏప్రిల్ 1 నుండు జియో యూజర్లు కూడా ఇంటర్నెట్ కి డబ్బులు కట్టాల్సిరావడంతో ఇన్నాళ్ళు జియో వైపు వెళ్ళిన తమ కస్టమర్లు మరల తమ వైపునకు తిప్పుకునేందుకు జియోకు తగ్గ రీతిలో అఫర్లు ప్రకటిస్తున్నాయి ఇతర నెట్ వర్కులు. తాజాగా ఆ జాబితాలో భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా చేరింది, తాము కూడా జియో కి ఏమాత్రం తగ్గకుండా రోజు 2జీబీ డేటా ఇస్తామని ప్రకటించింది. ఆ అఫర్ గురించి క్రింద చదవండి.
బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం STV 339 రూపాయలతో రీచార్జీ చేయించుకుంటే రోజు కి 2జీబీ 3G డేటా అందించనున్నారు అంతే కాకుండా ఆ ప్యాకేజీలో అన్ని నేషనల్ బిఎస్ఎన్ఎల్ నంబర్లకి ఉచితంగా కాల్ చేసుకోవచ్చు, ఇతర నెట్ వర్కులకు ఐతే రోజు 25 నిముషాలు ఉచితంగా కాల్ చేసుకోవచ్చు ఆ తరువాత నిముషానికి 25 పైసలు వసూలు చేస్తారు. తమ ఉత్తమ కస్టమర్లు తమను వీడిపోవద్దనే ఇలాంటి అఫర్లు ప్రకటించామని తెలిపారు బిఎస్ఎన్ఎల్ అధికారులు. అదే సమయంలో 303 తో రీచార్జీ చేసుకుంటే రోజుకు 1జీబీ 4G డేటా ఇస్తుంది జియో.