ఎప్పుడు ఆఫర్ల విషయంలో స్తబ్దుగా ఉండే బిఎస్ఎన్ఎల్ సంస్థ స్పీడు పెంచినట్లు ప్రస్తుత ఆఫర్ చూస్తే అర్థమవుతుంది. ఓవైపు మార్కెట్లో జీయో సంచలన ఆఫర్లకు పలు ప్రైవేటు సంస్థ ఏమిచేయాలో చెలియక డీలా పడుతుంటే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ అందరికి షాకిచ్చేలా ఆఫర్ ప్రకటించింది.
కేవలం నెలకు రూ.249కే అపరిమిత ఇంటర్నెట్ సేవలను బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ద్వారా అందించనున్నట్టు సంస్థ ఎండి అనుపమ్ శ్రీవస్తావ వెల్లడించారు. అంటే వినియోగదారుడు ఒక నెలలో 250 జీబీ వాడితే ఈ లెక్కన ఒక రూపాయికి ఒక జీబీ డాటాకు సమానమవుతుంది. ఈ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించింది. ఈ డేటా ప్లాన్ ద్వారా 2 ఎంబిపిఎస్ వేగంతో అపరిమితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చట. ఈ పథకం 6 నెలలు అమలులో ఉంటుందని, ఆ తరువాత ప్రస్తుత పథకాల్లో ఏదో ఒక అఫర్ కు ఎంపిక చేసుకోవాలని సంస్థ ఎండి అనుపమ్ శ్రీవస్తావ తెలిపారు. మరి ఇంకేంటి ఆలస్యం కనెక్షన్ తీసుకొని అపరిమిత డాటాను పొందండి మరి.
Must Read: రిలయన్స్ జియో బంపర్ ఆఫర్: 75జీబీ డేటా 4G ఉచితం.