శివపుత్రుడు, అపరిచితుడు, ఐ, మల్లన్న సినిమాలలో వైవిధ్యంగా కనపడిన విక్రం ఇప్పుడు తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తో ‘ఇరు ముగన్’ సినిమా చేస్తున్నారు.విక్రం తాజా సినిమా ‘ఇరు ముగన్’ ఫస్ట్ లుక్ ఆన్ లైన్లో హల చల్ చేస్తోంది. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ తో అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. సగం యంత్రం, సగం మనిషిగా వినూత్న రూపురేఖలతో ఉన్న విక్రం ఈ పోస్టర్లో దర్శనమిస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేరీతిలో ఉన్న ఈ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా లో విక్రం హిజ్ర తరహ ప్రయోగాత్మక పాత్ర చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో మరొక విశేషం ఏమిటంటే విక్రం డ్యూయల్ రోల్ చేస్తున్నారు.కొంత కాలంగా విక్రంకు వరుసగా వచ్చిన సినిమాలు ఆశించినంత విజయాలు సాధించలేదు. ‘ఇరు ముగన్’సినిమాకు సుమారు 85 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా లో విక్రం సరసన నయనతార, నిత్యా మీనన్ హీరొయిన్ లు గా నటిస్తున్నారు.ఈ సినిమా లో విక్రం చేస్తున్న ఈ ప్రయోగం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి!.