టాలీవుడ్ లోని హీరోలలో సింహభాగం మెగా కుంటుంబం నుండే ఉన్నారనటంలో ఎవరికీ సందేహం లేదు. మెగా ఫ్యామిలీ నుండి చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇంకా నిహారిక కూడా తెలుగు చలన చిత్ర ప్రేక్షకులకు సుపరిచితులే. కానీ, ఇటీవలే పరోక్షంగా అల్లు అర్జున్ మరియు సాయి ధరమ్ తేజల మధ్య మొదలైన వివాదం కాస్త ముదిరినట్టు కనిపిస్తుంది. అసలే పవన్ కల్యాణ్ తీరు అర్దం అవక తల పట్టుకుంటున్న మెగా క్యాంపు అభిమానులకు ఇప్పుడు ఈ వివాదం మరో తలనొప్పిగా మారనుంది.
ఇటీవల ఓ పబ్లిక్ ఫంక్షన్ లో పవర్ స్టార్ అభిమానులను ‘చెప్పను బ్రదర్’ అనే మాటతో కించపరిచి వారి నుండి మర్యాద కోల్పోయిన అల్లు అర్జున్ వ్యవహారం అందరికి తెలిసిందే. ఆ సంఘటణ జరిగిన తరువాత మరో ఫంక్షన్ లో అల్లు అర్జున్ కు వ్యంగ్యంగా మరియు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహ పరిచేలా ఇంకా “అరవండి బ్రదర్” అని పవన్ అభిమానులకు సూచించాడు సాయి ధరమ్ తేజ్. ఈ సంఘటనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్దలకు కారణం అయినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం అల్లు ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీయటానికి ముందుకొస్తున్న పెద్ద నిర్మాతలకు అడ్డు పడుతున్నారట. సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీస్తే ముందు ముందు కష్టాలు ఎదురుకోవాల్సి వస్తుందని ఇన్డైరెక్ట్ గా నిర్మాతలకు సమాచారం పంపుతున్నారట దీనితో తమకు ఎందుకొచ్చిన తంటా అని నిర్మాతలు వెనుకకు తగ్గుతున్నారట. ఏది ఏమైనా అల్లు ఫ్యామిలీ సభ్యులు తీరు పట్ల అందరూ అసహనం వక్తం చేస్తున్నారు.