బహిరంగ మల విసర్జనను రూపు మాపేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు చాలా పథకాలు అమలు చేసింది. మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి సబ్సిడీ ఇవ్వటం కూడా చేసింది. అయినా, చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలు మరుగుదొడ్లు 100% ఉపయోగించటం లేదు. బహిరంగ విసర్జనను రూపు మాపేందుకు, ప్రజలు మరుగుదొడ్డిని వాడేలా ప్రోత్సహించేందుకు ఓ జిల్లా కలెక్టర్ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ప్రతిరోజు క్రమం తప్పకుండా మరుగుదొడ్లు వాడే కుటుంబానికి ప్రతి నెల రూ.2500 అందజేస్తామని రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కలెక్టర్ అయిన సుధీర్ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం 2 గ్రామ పంచాయితీల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పిన తెలియజేసారు. ఈ పథకం కెయిర్న్ ఇండియా, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రారంభంలో భాగంగా 8 కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ పథకం ద్వారా చాలా కుటుంబాలకు లబ్ది చేకూరుతుందనీ… తమ లక్ష్యం నెరవేరితే ఇతర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరిస్తామని కలెక్టర్ తెలిపారు.