జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి చాలా ఆనందంలో ఉన్నాడు, మరోవైపు ‘శ్రీమంతుడు’ చిత్రంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ షేక్ చేసి తన తదుపరి సినిమా పై దృష్టి పెట్టేశాడు దర్శకుడు కొరటాల శివ.. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’.. ఈ సినిమాకు అందరు పెద్ద పెద్ద నటినటులు మరియు సాంకేతిక నిపునులు పనిచేస్తున్నారు. ఇందులో మొదట సమంతని మెయిన్ హీరోయిన్ గా అనుకున్న ఎన్టీఆర్ తో నటించిన ‘రభస’, ‘రామయ్య వస్తావయ్య’ చిత్రాలు ఫ్లాపు అవడంతో సెంటిమెంట్ గా ఫీల్ అయిన జూనియర్ సమంతని పక్కనపెట్టినట్లు తెలుస్తుంది. రెండవ హీరోయిన్ గా నిత్యామీనన్ ని ఇప్పటికే ఎంపిక చేశారు.
‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో తనకి జోడిగా నటించిన రకుల్ ప్రీత్ వైపు జూనియర్ మొగ్గు చూపగా ‘శ్రీమంతుడు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శృతి హసన్ ని కొరటాల ఎంపిక చేయాలనీ చూస్తున్నాడు. శృతి హసన్ ని ఎంపిక చేసే అవకశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.