Home / Entertainment / తెరపై నటుడిగా తెరంగేట్రం చేయనున్న మరో ప్రముఖ దర్శకుడు.

తెరపై నటుడిగా తెరంగేట్రం చేయనున్న మరో ప్రముఖ దర్శకుడు.

Author:

Seethamma Andalu  Ramayya Sitralu

ఎన్. శంకర్ 1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ప్రశంసలు అందుకుంది.

అయితే శంకర్ ఎప్పుడు తెర వెనుక మాత్రమే కాని మొదటి సారి రామ్‌కీ హీరోగా, మహేష్ కత్తి దర్శకత్వంలో రూపొందిన ‘రిపోర్టర్” మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. కాని అది వచ్చిందో లేదో ఎవ్వరికి తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్, ఆర్తన జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే చిత్రంలో ఎన్ శంకర్ ఒక ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కి తండ్రిగా చేశాడని సమాచారం. రాజ్ తరుణ్ మరియు శంకర్ మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చిత్ర యూనిట్ కూడా చెబుతుంది. ఇక ‘భలే భలే మొగడివోయ్’ చిత్రానికి సంగీతం అందించిన గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. జనవరి 10న ఆడియోని విడుదల చేసి, చిత్రాన్ని జనవరి 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే హ్యట్రిక్ సినిమా హిట్లతో మంచి ఊపు మీదున్న రాజ్ తరుణ్ ఈ చిత్రంతో కూడా మంచి హిట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

(Visited 85 times, 1 visits today)