దేవి సినిమాతో సంగీత ప్రపంచంలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునీ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ త్వరలో వెండితెరపై హీరోగా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా అభిమానుల మన్ననలు పొందుతూ దూసుకుపోతోన్న ఈ రాకింగ్ స్టార్. వరుస హిట్స్తో యూత్లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికే తెలుగు, తమిళ భాష చిత్రాలలో సంగీతంతో తన టాలెంట్ చూపించిన దేవి శ్రీ ప్రసాద్ నటించబోతున్న సినిమాకి సంబంధించి తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటన చేసాడు. ఈమధ్యే విడుదలైన ‘కుమారి 21F’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుడు సుకుమార్ నిర్మాతగా రూపొందించిన ఈ సినిమా హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యం లోనే ‘కుమారి 21F’ టీమ్ హైద్రాబాద్లో ఓ సక్సెస్ మీట్లో ఏర్పాటు చేసింది. ఇక ఈ సక్సెస్ మీట్కు హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక ఆసక్తికర ప్రకటన చేశారు.
ఇప్పటికే ఎన్నోసార్లు హీరోగా నటించమని అవకాశాలు వచ్చినా, దేవిశ్రీ వాటన్నింటినీ పక్కనబెట్టి మ్యూజిక్ పైనే శ్రద్ధ పెట్టారు. అయితే సరైన స్క్రిప్ట్ వస్తే మాత్రం హీరోగా చేసేందుకు తాను సిద్ధమే అని మాత్రం దేవీ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ సరైన స్క్రిప్ట్ను దిల్రాజు సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇక ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తారని దిల్రాజు ప్రకటించడం ఇక్కడ మరో ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. దిల్రాజు-సుకుమార్ల కాంబినేషన్లో అందులోనూ హీరో దేవిశ్రీ అంటే ఈ కాంబినేషన్ వినడానికే అద్భుతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.