అవినీతి కేసుల్లో పట్టుబడిన హెచ్ .ఎం డి.ఎ మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి సంపద అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులను అవాక్కయ్యేలా చేసింది. అదేదో సినిమా లో చెప్పినట్లు ఆయన ఇంటిలో నివసించే వారు తప్ప అణువణువూ విదేశీ వస్తువులే!
హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ సొసైటీ లోని ఆయన ఇంట్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయట పడ్డాయి.
ఆదాయాన్ని మించిపోయిన ఆస్తులు
పురుషోత్తం రెడ్డి అక్రమ సంపాదన వివరాలు తవ్వే కొద్దీ వస్తున్నాయి.చంచల్ గూడ జైలులో ‘ఆదాయాన్ని మించిన ఆస్తుల’కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్న ఆయనను కస్టడీ లోకి తీసుకొన్న అనిశా అధికారులు ఆయన ఇంటిని సీజ్ చేసి కుటుంబ సభ్యుల సమక్షంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగలు, ఆస్తులు బయట పడ్డాయి.
సోదాల్లో బయట పడ్డ సొమ్ములు
*60లక్షలకు పైగా విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు నగలు
*12లీటర్ల ఖరీదైన విదేశీ మద్యం
*విలువైన గృహోపకరణాలు
ఇవికాక
*లక్షా పదివేల నగదు
* 9వేల విలువ కల పాత నోట్లు
*501అమెరికా డాలర్లు
*265 యుఏఇ కరెన్సీ
*20లక్షల విలువ చేసేపట్టు చీరలు
ముందే జాగ్రత్త పడిన నిందితుడు
క్రెడిట్ కార్డు బిల్లులు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకొన్న అధికారులకు పురుషోత్తం రెడ్డి ఇంట్లో లిఫ్ట్, ఫర్నీచర్ ,టీవిలు లాంటి ఆధునిక సౌకర్యాలు నోరెళ్ళ బెట్టేలా చేశాయి.
కొస మెరుపేమిటంటే అనిశా దాడులను ముందే ఊహించి కొన్ని విలువైన డాక్యుమెంట్లు,అతి ఖరీదైన వస్తువులు ముందుగానే మరో చోటికి తరలించినట్లు సమాచారం.