Home / Entertainment / తనకు వచ్చిన నేషనల్ అవార్డ్ ప్రైజ్ మనీని బసవతారకం హాస్పిటల్ కు ఇచ్చిన క్రిష్

తనకు వచ్చిన నేషనల్ అవార్డ్ ప్రైజ్ మనీని బసవతారకం హాస్పిటల్ కు ఇచ్చిన క్రిష్

Author:

 

director krish donates national award winning money

డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ పరిచయం అవసరం లేని తెలుగు దర్శకుడు. ఇతను మొదటి నుండే తన పంత వేరు అంటు గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురమ్ వంటి సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. క్రిష్ చివరి చిత్రం అయిన కంచె సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డ్ ను గెలుపొందింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ అవార్డ్స్ ఎప్పుడో ప్రకటించినా, ఈ నెల 3వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదుగా అందరు అవార్ద్స్ అందుకున్నారు  అందులో క్రిష్ కూడా ఒకడు. కానీ ఎవరు చేయని పని క్రిష్ మాత్రం చేశాడు. అవార్డుతో వచ్చిన డబ్బును క్రిష్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు ఆర్ధిక సాయంగా అందించారు.

             అంతకు ముందు కూడా క్రిష్ గుంటూరు జిల్లా వినుగొండ దగ్గర కుంచెర్ల గ్రామం దగ్గర ఉన్న తన సొంత ఆస్తిని ఏ.పి ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చాడు. ఆ గ్రామంలో ప్రాథమిక వైద్యశాల సదుపాయం లేదు, ఎవరైనా ఓ ఎకరం భూమిని ఇస్తే హాస్పిటల్ కడతామని ప్రభుత్వం తెలియజేసినప్పుడు క్రిష్ తన పేర ఉన్న ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. తన తల్లితో పాటు పలువురు వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్న బసవతారం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు ఈ డబ్బును ఇవ్వడం సంతోషంగా ఉందని క్రిష్ తెలియజేశారు.

(Visited 342 times, 1 visits today)