Home / Entertainment / ఎన్టీఆర్(జనతా గ్యారెజ్)పై వస్తున్న పుకార్లను నమ్మకండి – మైత్రీ మూవీ మేకర్స్

ఎన్టీఆర్(జనతా గ్యారెజ్)పై వస్తున్న పుకార్లను నమ్మకండి – మైత్రీ మూవీ మేకర్స్

Author:

Janatha-Garage-Updates

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి జోరులో ఉన్నాడు. వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. మిర్చి,శ్రీమంతుడు వంటి చిత్రాలతో తెలుగు చిత్రసీమను తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా “జనతా గ్యారెజ్ “. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుపుకుంటోంది. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ ఉదయం నుండి ఒక పుకారు షికారై తిరుగుతుంది. అదేంటంటే షూటింగ్ లో ఎన్టీఆర్‌కు ఓ ప్రమాదం జరిగిందని.

           కానీ జనత గ్యారెజ్ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ పుకార్లను కొట్టిపడేస్తూ ఓ నోట్ విడుదల చేసింది. ఫేక్ ఎకౌంట్స్ ద్వారా బయటకొస్తున్న పుకార్లను నమ్మవద్దని, మైత్రీ మూవీ మేకర్స్ వారి అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్‌ అయిన @mythriofficial  ద్వారా మాత్రమే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకొస్తాయని టీమ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

(Visited 320 times, 1 visits today)