పామును గానీ తేలును గాని చూస్తే మనకు ఒక్క క్షణం గుండె ఆగినంత పని అవుతుంది. మరి కాటేస్తే ఇక చెప్పవలసిన అవసరమే లేదు కానీ ఇంతటి ప్రాణాంతకమైన, విషం చిమ్మే వాటికి ఇప్పుడు లక్షలు, కోట్లల్లో గిరాకి ఉంది తెలుసా! వీటికి ఎందుకు గిరాకి ఉంది అనుకుంటున్నారు?
మానవ శరీరానికి పాముగానీ, తేలుగాని కరిస్తే దానీ విష ప్రభావాన్ని బట్టి మనిషి బ్రతుకుతాడా లేద అని డాక్టర్స్ కే డౌట్ గా ఉంటుంది, అంత ప్రమాదకరమైన వాటి విషం ఇప్పుడు లక్షలు, కోట్లు తెచ్చిపెడుతుంది. అవును మీరు వింటుంది నిజమే….
పాము విషం లక్షల్లో లాభాలు తెచ్చి పెడుతుంటే, తేలు విషం మాత్రం కోట్లల్లో లాభాలు తెచ్చిపెడుతుంది. దీనికి కారణం వీటి విషాన్ని దివ్యౌషదంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవపదార్థంగా తేలు విషం ఉందంటే నమ్ముతారా..! తేలు విషం ఒక్క లీటర్ 26కోట్లు పలుకుతుంది తెలుసా..! అదే పాము విషం మాత్రం లీటర్ కు 27 లక్షలు పలుకుతుంది.
తేలు విషమే ఎందుకు అంత రేటు పలుకుతుందంటే? తేలు విషంలోని ప్రోటీన్, కీళ్ళ వాపుకు, పేగు వ్యాధికి మరియు కొన్ని రకాల కేన్సర్ చికిత్సకు కూడా దివ్యౌషదంగా ఉపయోగపడుతుంది. అందువలనే ఈ అరుదైన తేలు విషం అంత ఎక్కువ ధర పలుకుతుంది.అలాగే పాము విషాన్ని ఈ మధ్యలో పబ్బులలో మత్తు, కిక్కు కోసం వాడుతున్నారు. తక్కువ టైం లో ఎక్కువ కిక్కు కావాలి అనుకునేవారికి దొంగ చాటుగా పబ్బు వారు పాము విషాన్ని తెచ్చి మరి అమ్ముతున్నారు.
Must Read: ఫోన్ ఉంటే చాలూ ఇవన్నీ ఉచితమే..!