భారత్, ఇంగ్లాండ్ ల మధ్య నిన్న బెంగళూరు లో జరిగిన మూడవ టీ-20 మ్యాచులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి టీ-20 సిరీస్ ని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ బౌలర్లకు మన బ్యాట్స్ మెన్ చుక్కలు చూపించారు. సురేశ్ రైనా 63, ధోని 56 పరుగులకు, చివర్లో యువరాజ్ మెరుపులు తోడవడంతో భారత్ 20 ఓవర్లకు 202 పరుగులు చేసింది.
203 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్ళకు మన బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి వికెట్ ని తొందరగానే కొల్పోయిన ఇంగ్లాండ్ ని రూట్, మోర్గాన్ లు ఆదుకున్నారు కాని భారత బౌలర్ చాహల్ తన లెగ్ స్పిన్ మాయాజాలంతో 6 వికెట్లు తీసి మ్యాచు ను పూర్తిగా ఇండియా వైపుకు తిప్పాడు. ఒకానోక సమయంలో 119 పరుగులకు రెండు వికెట్లే కోల్పోయి మంచి స్తానంలో ఉన్న ఇంగ్లాండ్ మన బౌలర్ల దాటికి తరువాత 8 పరుగులకే 8 వికెట్లు పోగొట్టుకుని 127 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. మ్యాచు ని మలుపు తిప్పిన 8 వికెట్ల వీడియోను పైన చూసి ఆనందించండి.