Home / Inspiring Stories / కన్న కూతురి పైనే అత్యాచారం చేయబోయిన కసాయి తండ్రి..!

కన్న కూతురి పైనే అత్యాచారం చేయబోయిన కసాయి తండ్రి..!

Author:

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, రాక్షసంగా ఆలోచించి కన్న కూతురిని అత్యాచారయత్నం చేసి, హత్య చేసిన వార్త రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లయ్య ఈ నీచానికి పాల్పడటం జరిగింది. జిల్లా పోలీసులకి దొరికిన కామాంధుడు మల్లయ్య తను చేసిన తప్పుని ఒప్పుకోవటం జరిగింది.

rape-and-murder

కన్న కూతురు అయిన మౌనికపై అత్యాచారయత్నం, హత్య కేసులో మల్లయ్య నేరాన్ని అంగీకరించాడు. భార్య తనను లెక్క చేయలేదని, బిడ్డ తన మాట వినలేదని, వారిపై పగ పెంచుకున్నానని చెప్పాడు. “వీళ్ల మీద నాకు ఎప్పటి నుంచో బాగ కోపంగా ఉంది. 5 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాను.. అప్పు అయ్యింది. ఓ వైపు అప్పు, మరోవైపు నా పెళ్ళాం బిడ్డల మీద కోపం తోనే నేను ఈ పని చేశాను. అయితే నా బిడ్డను కోరుకున్నా, కాని తాను ఒప్పుకోలేదు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందోనని భయపడి చంపేశాను.. నా సెల్‌ఫోన్‌ను అక్కడే బావిలో వేసి నా బిడ్డ సెల్‌ఫోన్‌ను ఆఫ్ చేసి నా ఇంట్లో దాచిపెట్టాను. దీంతో, పోలీసులు నన్ను పట్టుకున్నారు” అని వివరించాడు.

ఇలాంటి కిరాతకులకి ఎలాంటి శిక్ష వేసిన తప్పు లేదు, శిక్షలు కఠినంగా ఉండాలని సోషల్ మీడియాలో యువత విస్తృత ప్రచారం చేస్తుంది.

(Visited 2,013 times, 1 visits today)