ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 50 కి పైనే ఉండే డిల్లిలో చలికాలం కూడా అదే రేంజ్ లో ఉంటుంది ఒక్కోసారి ఉష్ణోగ్రతలు మైనస్లొకి వెళ్ళిపోతాయి కూడా. ఇది వరలో ఒక సారి డిల్లిలో పొగమంచు వల్ల ముందేం ఉందో కనిపించక ఒక మోటార్సైక్లిస్టు డైరెక్ట్ గా పీ ఎం కాన్వాయ్ లోకి దూసుకు పోయిన సంగతి గుర్తుంది కదా. అలాగే ఇప్పుడు మరో ఘటన ఐతే ఇది మరీ ఘోరం ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 వాహనాలు ఒకదాన్ని ఒకటి గుద్దేసుకున్నాయి. గ్రేటర్ నోయిడాకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవార్ టోల్ ప్లాజా దగ్గర జరిగిందీ ఘటన. దట్టంగా పేరుకు పోయిన మంచు వల్ల కనీసం 10 అడుగుల దూరంలో ఏముందో కూడా కనిపించని పరిస్థితి. దాంతో ఒక దాని వెనక ఒకటిగా వచ్చి గుద్దుకున్నారు. ఐతే ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణాపాయం మాత్రం జరగలేదు….