‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’.. ఇలా టైటిల్ చివర సున్న వచ్చే సినిమాలతో మంచి విజయాలు అందుకున్న హీరో గోపీచంద్, తాజాగా యజ్ఞం తో తనకు మంచి హిట్ ఇచ్చిన ఏ.ఎస్.రవికుమార్ తొ మళ్ళి‘పిల్లా నువ్వులేని జీవితం’తో మంచి హిట్ ఇచ్చిన తర్వాత వస్తున్న తన కొత్త సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ ‘సౌఖ్యం’ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలకు రెడీ అవుతోంది.
డిసెంబర్ 13న పెద్ద ఎత్తున ఆడియో రిలీజ్ జరగనుండగా, దానికి పదిరోజుల ముందుగానే సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసే ఆలోచనలో ఈ సాయంత్రం ‘సౌఖ్యం’ టీమ్ ఓ టీజర్ను విడుదల చేయనుంది. ఇప్పటికే స్టిల్స్, పోస్టర్స్తో ఓ మంచి ఫ్రెష్ లుక్ కల్పించిన యూనిట్, టీజర్తో మరింత ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్గా నటించారు. గోపీచంద్ మార్క్ యాక్షన్కు ప్రాధాన్యం ఇస్తూనే ఫ్యామిలీ ఎమోషన్కు పెద్ద పీట వేశారని తెలుస్తోంది.