పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి కథానాయకుడిగా ఇటీవల రిలీజైన చిత్రం ‘ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆర్ నారాయణ మూర్తి సరసన జయసుధ కీలక పాత్ర పోషించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, చదలవాడ పద్మావతి నిర్మించడం జరిగింది.
ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్నన పొందుతున్న ఈ చిత్రం కోసం, ఆదిలాబాద్ జిల్లాలోని 230 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఎస్పీ ఇవాళ సెలవు ప్రకటించారు. హెడ్ కానిస్టేబుళ్ళందరూ తమ కుటుంబ సభ్యులతో ఈ సందేశాత్మక చిత్రాన్ని చూడాలని చెప్పారు. ఇందుకు గాను ఆదిలాబాద్ లోని ఓ థియేటర్లో ఉచితంగా ఈ సినిమాని చూసే అవకాశం కల్పించారు.