Home / health / సపోటా పండ్లు దగ్గు, జలుబునే కాక కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది.

సపోటా పండ్లు దగ్గు, జలుబునే కాక కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది.

Author:

సపోటాని ఇష్టపడని వారంటూ ఉండరు. ఎందుకంటే సపోటా పండ్ల యొక్క రుచి అలాంటిది. తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉందీ పండ్లలో సపోటా ఒకటి. సపోటా పండులో ఎన్నోరకాల పోషకాలున్నాయి. సపోటా పండ్ల గుజ్జుకు జీర్ణం చేసే గుణం ఉంటుంది. సపోటా పండ్లలో శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ లభిస్తుంది. సపోటా తింటే కంటికి చాలా మంచి చేస్తుంది. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండి, వృద్ధాప్యంలో కూడా కంటి చూపు బాగుండడానికి సహాయపడుతుంది. కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల సపోటా పండు ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది.

health-benefits-of-sapota-fruit
పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో, అందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. ఇది జలుబు, దగ్గు తగ్గడానికి దోహద పడుతుంది. మూత్ర పిండాల్లో రాళ్లు కరగటానికి సపోటా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

(Visited 798 times, 1 visits today)