ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి వస్తే బ్రతికున్న శవంతో సమానం అంటారు చాలా మంది ఎందుకంటే ఏ పదర్థాలు తినకూడదు, ఎలాంటి డ్రింక్స్ తాగకూడదు అంటూ నాలుకను చంపుకోవాలి అంటారు. చాలా మంది షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఖరీదైన మందులను వాడుతుంటారు దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ తో కొత్త రోగాలు వస్తున్నాయి.కానీ ఒక ఆకును మీరు వాడితే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. చాలా మంది ప్రయోగాత్మకంగా ఉపయోగించినా మంచి ఫలితాలను పొందారు.
దీని తయారీ విధానం:
- ఒక గిన్నెలో 10 బిర్యాని ఆకులను తీసుకోవాలి.
- 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి.
- స్టవ్ నుండి దించి ఒక 2 నుండి 3 గంటలు అలానే ఉండనివ్వాలి.
- నీటిలో ఉన్న ఆకులను తీసి మిగిలిన రసాన్ని సగం గ్లాస్ చొప్పున రోజుకు మూడు సార్లు తాగాలి.
- ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
- ఇలా మూడు రోజులు తప్పకుండా చేయాలి. తరువాత 2 వారాల తరువాత మళ్లీ చేయాలి.
- రెండు సార్లు చేస్తే తప్పకుండా షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
దీని వలన ఉపయోగాలు :
- ఈ రసం ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయడం వలన డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.
- క్యాన్సర్ కారకాలను ఎదురుకునే రోగ నిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.
- అలాగే కొలెస్ట్రాల్ తగ్గడం వలన గుండె జబ్బులు కూడా దరిచేరవు.
(Visited 15,902 times, 1 visits today)