Home / Entertainment / కోటి రూపాయల జీతం కన్నా దేశమే ముఖ్యం అన్న డిల్లి ఐఐటియన్లు.

కోటి రూపాయల జీతం కన్నా దేశమే ముఖ్యం అన్న డిల్లి ఐఐటియన్లు.

Author:

make1

దేశంలోనే అత్యున్నత విధ్యాలయాల్లో ఒకటైన కాన్పూర్ ఐఐటీ విధ్యార్థులు వాళ్ళు.పట్టబద్రులు ఐపోకముందే వారికోసం పలు కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలతో క్యూలుకట్టాయి. గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాతక కంపెనీలు కోటి రూపాయల జీతమంటే అప్పుడే చదువు పూర్తయ్ ఉద్యోగానికి వెళ్ళే ఏ విధ్యార్థి అయినా ఎగిరి గంతేసేవాడు . విదేశాలకు వెళ్లాలనే మోజుతో ఈ ఆఫర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తాడు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. తమ దేశం కోసం పనిచేయాలనుకునే వారూ మొదలౌతున్నారు..

కాంపూర్ లో జరిగిన క్యాంపస్ నియామకాల్లో ఎనిమిది మంది అభ్యర్థులు సెలక్ట్ అయ్యారు. వారి కోసం ఆయా కంపెనీలు ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైగా జీతాన్ని ఆఫర్ చేసాయి కూడా అయితే ఎనిమిది మందిలో నలుగురు విద్యార్థులు ఈ భారీ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్టు ప్లేస్మెంట్ సెల్లో చెప్పారు.అంతేకాదు వారు భారత దేశం లో ఎంచుకొని చేరిన కంపెనీలు వారికి ఆఫర్ చేసిన జీతాలు మొదటి వాటికన్నా చాలాతక్కువ కూడా దాదాపు సగానికి సగం తక్కువ జీతాలకి చేరిపోయారు..

make

ఇక్కడే కాదు ఇదివరకు బాంబే ఐఐటియన్లు కూడా కోర్ కంపెనీల లో ఉద్యోగాలని తిరస్కరించి తక్కువ జీతాలకే అయినా భారత దేశం లోనే పని చేస్తామని ఇక్కడే ఉండిపోయారు.ఈ సంఖ్య పెరుగుతూ వస్తోని పోయిన సంవత్సరం ఇది 174 మందిలో 35 మంది బయటకు వచ్చేస్తే ఈ సంవత్సరం ఆసంఖ్య 172 మందికి గానూ 60 మంది కోర్ కంపెనీల్లో పనిచేయమంటూ భారత దేశం లోనే తక్కువ జీతాలకే చేరిపోతున్నారు. మోడీ మేక్ ఇన్ ఇండియా ప్రభావమో ఏమో కానీ ఇలా మేధో వలసలు ఆగిపోవటం దేశానికి మంచిదే కదా…

(Visited 143 times, 1 visits today)