భారత్ సాంకేతిక రంగంలో మరో అడుగు ముందుకేసింది. దేశీయ పరిఙ్ఞానంతో తయారు చేసిన వస్తువుల మీద మనకు ఉండే చిన్న చూపుని తగ్గించే ప్రయత్నంలో మనం తలుచుకుంటే ఎటువంటి అద్బుతాలను చేయగలమో నిరూపించింది ఇండియన్ రైల్వే. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా పూర్తి స్థాయి భారతీయ పరిఙ్ఞానంతో తయారు చేసిన 6 రైల్వే కొచ్ లను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తోంది. ఒక ఒప్పందం ప్రకారం వచ్చే రెండున్నర సంవత్సరాలలో 450 అత్యాధునిక రైల్వే భోగీలు ఆస్ట్రేలియాకు పంపనున్నారట.2.7 అమెరికన్ డాలర్ల ఈ డీల్ పై వడొదరా బొంబార్దియర్ ట్రాన్స్ పోర్ట్ తో కూడా ఈ రైల్వే కోచ్ ల రవాణా ఒప్పందం కుదింది కూడా…
ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం బుక్ చేసుకున్న బరోడా ప్లాంట్లో నిర్మించిన 6 కోచ్ లు ముంబై పోర్ట్ లో షిప్ప్ లలో లోడ్ చేయబడ్డాయి కూడా. భారీ వస్తువులను చేరవేసే కార్గో షిప్లు వాటిని మోస్తూ బయలు దేరే సమయం కోసం ఎదురు చూస్తున్నాయినంటూ నౌకా మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన ప్రకటన చెబుతోంది. ఒక్కో కోచ్ 75 అడుగుల పోడవూ,46 టన్నుల బరువూ ఉన్న ఆరు రైల్వే కోచ్లనూ అత్యంత జాగ్రత్తగా,భారీ క్రేన్ల సాయంతో షిప్ లోకి ఎక్కించారట. ఈ ఓవర్ సైజు లో ఉన్న మెట్రో కోచ్ లని షిప్ లోకి ఎక్కించటానికి చాలా తంటాలే పడ్డారట పోర్ట్ అధికారులు. వీటిని లోడ్ చేసే భారీ క్రేన్ ని నడపటానికి బయటి నుంచి ప్రత్యేకంగా ఆపరెటర్లనూ టెక్నీషియన్లనూ రప్పించారట…
భారత రైల్వే గురించి మరికొన్ని విశేషాలు:
నిజానికి భారత దేశం ఆర్థికంగానూ,మేదా సంపత్థిలోనూ ప్రపంచం లోనిఉ మిగిలిన ఏదేశం కన్నా తక్కువకాదు. కానీ ఇంత ఘనత సాధిస్తూకూడా ఇంకా వెనుకబడే ఉంటున్నం అంటే….. సమాధానం మీకూ తెలుసు.