ఈ రోజుల్లో ఎక్కడ చూసిన చిన్న-పెద్ద మరియు పేద-ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు మొబైల్ నొక్కకుండ ఉండలేని వారు మనలో చాల మంది ఉన్నారు. ఒకప్పుడు తెలియని విషయాలను ఇతరులని అడిగి తెలుసుకునే వారు. కాని, ఇప్పుడు ప్రతీది చేతిలోని మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా గూగుల్ చేస్తున్నారు. అంతే కాక ఎప్పుడూ ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూ ఏకాంతంగా గడుతున్నారు.
ఇంటర్నెట్ అధికంగా ఉపయోగించటం వల్ల ఈతరం యువత ఎక్కువగా ఒంటరి తనానికి అలవాటు పడుతోందని సర్వేలు చెప్తున్నాయి. ఇది క్రమంగా అందరిని ప్రత్యక్షంగా కలవకపోవటానికి, దీర్ఘ కాలంలో ఒంటరితనం ఫీలయ్యేలా చేస్తుందట.