Home / Latest Alajadi / IPL వేలంలో భారత యువ ఆటగాళ్ల జోరు..! మనీష్ పాండేకి రూ.11 కోట్లు..!

IPL వేలంలో భారత యువ ఆటగాళ్ల జోరు..! మనీష్ పాండేకి రూ.11 కోట్లు..!

Author:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11 వ సీజన్ ఆటగాళ్ల వేలంలో యువ ఆటగాళ్లు జోరు చూపించారు, బెంగుళూరులో జరుగుతున్న వేలంలో అన్ని జట్లు యువ ఆటగాళ్ళని దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి, ఈరోజు జరిగిన ఆటగాళ్ల వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ బెన్ స్ట్రోక్స్ ని రూ. 12.50 కోట్లకి దక్కించుకుంది, భారత ఆటగాళ్లలో మనీష్ పాండే అత్యధిక ధర పలికాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మనీష్ పాండేని రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL-Auction-Ben-Strokes

… కె.ఎల్.రాహుల్ ను రూ.11 కోట్లకు, కరుణ్ నాయర్ ను రూ.5.6 కోట్లకు, డేవిడ్ మిల్లర్ ను రూ.3 కోట్లకు, యువరాజ్ రూ. 2.40 కోట్లకు కింగ్స్ పంజాబ్ జట్టు తీసుకుంది.

… క్రిస్ లైన్ ను రూ.9.6 కోట్లకు కోత్ కతా నైట్ రైడర్స్ తీసుకుంది.

… ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్ వెల్ ను రూ.9 కోట్లకు, గంభీర్ ను రూ.2.80 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది.

… ఇండియన్ స్పిన్నర్ అశ్విన్ ను రూ.7.60 కోట్లకు పంజాబ్ టీం సొంతం చేసుకుంది.

… బ్రావో రూ.6.40 కోట్లకు, హర్భజన్ ను రూ.2 కోట్లకు, డూప్లిసెస్ ను రూ.1.60 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్లులోకి వెళ్లారు.

… శిఖర్ ధావన్ ను రూ.5.20 కోట్లకు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం మళ్లీ దక్కించుకుంది.

… పోలార్డ్ ను రూ.5.40 కోట్లకు ముంబై తీసుకున్నది.

… బ్రెండెన్ మెక్లాం రూ.3.5కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది.

… రహానేను రూ.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.

… విలియమ్ సన్ ను రూ.3 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకుంది.

(Visited 68 times, 1 visits today)