యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులకు ప్రేమతో ‘నాన్నకు ప్రేమతో’ లాంటి ఒక మంచి చిత్రాన్ని ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా అభిమానులు ఎన్.టి.ఆర్ కు సూపర్ హిట్ మాత్రమే కాదు తన కేరిర్లోనే పెద్ద హిట్ ఇచ్చి తనపై అభిమానన్ని చాటుకున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్న తన తదుపరి సినిమా జనత గ్యారేజ్, ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ ఓ మెయిన్ రోల్ చేస్తుంటే, మరో మలయాళ యంగ్ స్టార్ ఉన్ని ముకుందన్ విలన్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమాలో ఎక్కువ మలయాళ స్టార్స్ ఊండతో దానితో ఈ సినిమాకి మలయాళ రైట్స్ కోసం బంపర్ ప్రైజ్ పలికింది. ఈ సినిమాని క్యాష్ చేసుకోవడం కోసం ఓ ఫేమస్ కేరళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘జనత గ్యారేజ్’ రైట్స్ ని తీసుకున్నాయి. సుమారు 4.2 కోట్లకి జనత గ్యారేజ్ మలయాళ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఈ రేంజ్ ధరకి అమ్ముడు పోలేదు. మలయాళంలో బాహుబలి సినిమా (3.25 కోట్లకి అమ్ముడు పోయింది) ఇప్పటి వరకూ అత్యధిక రేటు పలికిన తెలుగు సినిమా. ఇప్పుడు ఎన్.టి.ఆర్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళని జనత గ్యారేజ్ తో బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ కానుంది.