Home / Entertainment / ‘జత కలిసే..’ అంటున్న అశ్విన్,తేజస్వి.

‘జత కలిసే..’ అంటున్న అశ్విన్,తేజస్వి.

Author:

ఓంకార్ తమ్ముడు ‘రాజు గారి గది’ సినిమా హీరో అశ్విన్ బాబు, కేరింత, ఐస్ క్రీమ్ ఫేం తేజస్వి జంటగా నటించిన తాజా చిత్రం ‘జత కలిసే..’ ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించారు. ఈ సినిమా కు కొత్త డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. పూర్తి హాస్య మరియు ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అశ్విన్ ఇంతకు ముందు ఆట వంటి ప్రోగ్రంలో డ్యాన్స్ పరంగ తన టాలెంట్ ని నిరుపించుకున్నడు. తర్వాత తన సొంత అన్నయ్య అయిన ఓంకార్ మొదటి సారి దర్శకత్వం వహించిన జీనియస్ చిత్రంలో ముగ్గురు హీరోలలో ఒకడిగా మొదటిసారి తెర మీదికి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఓంకార్ దర్శకత్వలో రాజు గారి గది సినిమాతో సొలో హీరోగా వచ్చాడు. కానీ అందులో  కామెడీ సినిమా కావడం వలన తన నటన పరంగా అంతగా ప్రతిభ చూపించలేకపోయాడు. రాజు గారి గది సినిమాలో హిట్ క్రేడిట్ అంత కమిడియన్స్ కి వెల్లింది. కాని ప్రస్తుతం విడుదలైన ‘జత కలిసే’ చిత్ర ట్రైలర్ చూస్తే నటనలో ప్రతిభ కనబరిచినట్లుగా కనిపిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ లో శకలక శంకర్ కామెడీ తో మరోసారి తన టాలెంట్ ని చూపించాడు. అలాగే సప్తగిరి శ్రీమంతుడు స్పూఫ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మొత్తనికి ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే సిన్మాలో లవ్ & యాక్షన్ తోపాటు కామెడీ కూడా పెద్దపీట వేసినట్టు తేలుస్తుంది.

(Visited 170 times, 1 visits today)