సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైలిష్ నటనతో ఇండియాలోనే కాదు బయటి దేశాలలో కూడ అభిమానులను సంపాదించుకున్నాడు. తన చివరి సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు దానితో మంచి కథ కోసం కొత్త దర్శకుడైన పా రంజిత్ చెప్పిన “కబాలీ” కథ వైపు మొగ్గు చూపాడు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్, ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా రికార్డ్ సృష్టించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు ముందే ‘కబాలీ’ 200 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇండియాతో పాటు రజనీకి బాగా పట్టున్న జపాన్, తొలిసారిగా మలేషియాలో కూడా భారీగా ‘కబాలీ’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళ బ్యూటి ధన్సిక లేడీ డాన్ గా కనిపిస్తోంది. భారి చిత్రాల నిర్మాత ‘కలైపులి ఎస్ థా’ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 11న విడుదల అవుతుండగా, సినిమా జులై 1న విడుదల కానుంది.