Home / Entertainment / పవన్ కళ్యాణ్ ని కలిసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

పవన్ కళ్యాణ్ ని కలిసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

Author:

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిసాడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చిన కుమార స్వామి పవన్ తో భేటీ అయ్యారు. కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమార్ తెలుగులో “జాగ్వార్” సినిమాతో సినీరంగ ప్రవేశం చేస్తుండటంతో తన కొడుక్కి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాలు కావాలని పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినట్టుగా తెలిపారు. కుమార స్వామి పవన్ కి జాగ్వార్ సినిమా ట్రైలర్ ని చూపించి జాగ్వార్ ఆడియో లాంచ్ కి రావాలని ఆహ్వానించారు.


ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ “తమ మధ్య 8 సంవత్సరాల నుండి స్నేహం ఉందని, కుమార స్వామి తనకి ఒక అన్నయ్య లాంటి వాడని, తమ ఎటువంటి రాజకీయ చర్చ జగరలేదని, నిఖిల్ కుమార్ సినీరంగ ప్రవేశం గురుంచే మాట్లాడుకున్నాం, ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో త్వరలో స్పందిస్తానని” పవన్ కళ్యాణ్ తెలిపాడు.

(Visited 79 times, 1 visits today)