డిసెంబర్ 7 న తప్పక ఓటు వేయండి గత కొన్ని రోజులుగా ప్రచారం కి తెరపడింది. ఎన్నికల రోజు రానే వచ్చింది. సెలబ్రిటీస్ కూడా సామాన్య జనంలా క్యూ లో నించొని ఓట్లు వేసి దేశం పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద ఎన్నికల జోరు బలంగా సాగింది. కొన్ని చోట్ల టీఆరెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. పోలీసులు సజావుగా సాగేలా చేసారు. చివరికి ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.
చింతమడకలో సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..”ప్రభుత్వ అనుకూల పవనాలు చాలా బాగా వీస్తున్నాయి. మేము ముందు నుంచి చెబుతున్నట్టుగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. మాకు ఎటువంటి అనుమానం లేదు మళ్లీ ప్రజా అనుకూల ప్రభుత్వమే వస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం మీరే చూస్తారు. ఈసారి పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో భారీగా పోలింగ్ నమోదవుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార”ని కేసీఆర్ చెప్పారు.