Home / Inspiring Stories / కేసీఆర్ అంతు చూస్తా..!

కేసీఆర్ అంతు చూస్తా..!

Author:

మరోసారి రేవంత్ రెడ్డి మాటలతో విరుచుకు పడ్డారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంతు చూస్తా అని వ్యక్తి గతంగా వ్యాఖ్యలుచేసారు. టీ
టీడీపీ విపక్ష నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వోటుకు నోటు వ్యవహారం లో ఇరుక్కొని అభాసు పాలైన సంగతి తెలిసిందే ఐతే నిన్న కోర్టు ఆయనకు సడలింపు ఇవ్వడంతో చాలా రోజుల తర్వాత ఈ వివాదాస్పద నేత  హైదరాబాదులో అడుగుపెట్టారు.హైదరా బాద్ లో రేవంత్ పేరుతో కొన్ని వందల ఫ్లెక్సీ లు దర్శణమిచ్చాయి. వేట మొదలయ్యింది, టైగర్ ఈజ్ బ్యాక్ అన్న అక్షరాలతో వందలాది ఫ్లెక్సీలు కట్టించారు.

ఈ సందర్భంగా మీడియా తో  మాట్లాడారు. ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం ఆపేది లేదనీ యుద్దం లో ఉన్న వీరుడు పోరాడటం తప్ప ఇంకేమీ ఎరగడనీ అన్నారు. ప్రజా సమస్యల పైన పోరాటం చెసే తను ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంతు చూస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుంటునా కేసీఆర్ కి అసలు చీమ కుట్టినట్తైనా లేదన్నారు అసలు ప్రజలని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారిగా కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు టీడీపీ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ కమిషనర్ తొలగిస్తున్నారు. మేం పిలుపునిస్తే ఒక్కే ఒక్క గంటలో హైదరాబాద్ లో టీఆర్ఎస్ జెండాలనేవి లేకుండా చేస్తాం. ఆ సత్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ చేయించడం అంత సులభం కాదు.. ఆయన తాగే సీసా ఖాళీ చేసినట్లు అనుకుంటే పొరపాటే అని అంటూ ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణను తీసుకువస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారన్నారు. కేసీఆర్‌కు మందులో సోడా పోసే మంత్రి తరహా నేతను తాను కాదన్నారు. త్వరలో కేసీఆర్ అంతు చూస్తానన్నారు. కేసీఆర్‌కు ఫాంహౌస్ పైన ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది టీడీపీయే అన్నారు. కేసీఆర్ నియంతృత్వ విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే మహానగరం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన చెప్పారు. సింగం సింగిల్‌గా హైదరాబాద్ వస్తుందని తెలిసి… కెసిఆర్ పిరికిపందలా ప్రత్యేక విమానం వేసుకొని చైనాకు పారిపోయాడన్నారు. మా అడ్డా ఇక్కడనే అని, ఇక్కడే ఉంటామన్నారు. కెసిఆర్ దొర కాదని, అరాచకవాది అన్నారు. ఆయన రాక్షసానందం పొందే వ్యక్తి అన్నారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇదంత ఒక ఎత్తైతే రేవంత్ రెడ్డి రాక సందర్బంగా కట్టిన ఫ్లెక్సీలపై సోషల్ మీడియా లో జోకులు పేలుతున్నాయి.

(Visited 35 times, 1 visits today)