మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్’ చిత్ర రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇప్పటికే తమిళ ‘తని ఒరువన్’ చిత్రంలో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే తెలుగులో కూడా భారీ పారితోషికం ఇచ్చి విలన్ గా నటింపజేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘రక్షక్’ గా టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ చిత్రానికి మొదట శృతి హసన్ ని సంప్రదించగా తనకి డేట్స్ ఖాళీగా లేవని, ఆలోచిస్తానని చెప్పగా నిర్మాత అల్లు అరవింద్ ఆలోచనలో పడ్డాడు.
అయితే తాజాగా రామ్ సరసన ‘నేను..శైలజ’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ని తని ఒరువన్ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపిక చేసారు చిత్ర యూనిట్. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ మలయాళ భామ తన నటనతో కూడా సినీ జనాలను ఆకట్టుకుంది. ఈ రీమేక్ సినిమా అయిన చరణ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.