Home / Entertainment / మహేష్ బాబుతో జోడిగా ఎంపికైనందుకు క్రేజీగా ఉంది ‘కీర్తి సురేష్’.

మహేష్ బాబుతో జోడిగా ఎంపికైనందుకు క్రేజీగా ఉంది ‘కీర్తి సురేష్’.

Author:

Mahesh Babu and Keerthi Suresh

‘నేను..శైలజ’… ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన మలయాళ భామ కీర్తిసురేష్ ఇప్పుడు క్రేజీ క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తుంది. ముందుగా మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్లు ఈ అమ్మడు మీడియాకి వెల్లడించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామని కొంతకాలం నుండి గమనిస్తున్న మహేష్ బాబు స్వయంగా తన సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకేక్కబోతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో మొదలుపెట్టడానికి మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నాడు.

‘నేను..శైలజ’ తో ఈ ఏడాది ప్రారంభంలోనే సూపర్ హిట్ సాధించిన ఈ భామ బడా హీరోలతో సినిమా అవకాశాలు వస్తుండటంతో సంతోషంతో గెంతులేస్తుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో తన అభిమాన హీరో మహేష్ బాబు అని కీర్తి సురేష్ ప్రకటించింది. అంతేకాకుండా మరోపక్క రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తమిళ రీమేక్ చిత్రం ‘తని ఒరువన్’ అనే చిత్రంలో కూడా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక దాదాపుగా ఖరారు అయింది. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ‘రైల్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఒక్క సినిమా హిట్ తో ప్రస్తుతం ఈ భామ అరడజన్ కి పైగా సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

(Visited 597 times, 1 visits today)