నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ ఓవల్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ కోహ్లీ మరో రెండు రికార్డులను సాధించాడు. మొదటి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకే అవుటైన టీమిండియా కెప్టెన్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అతడి వ్యక్తిగత స్కోరు 5 వద్ద ఆస్ట్రేలియాలో వేయి పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 250 పరుగులకి మొదటి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 235 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 15 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 191/7 ఓవర్నైట్ స్కోర్తో 88.1 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 44 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.
watch video:
Virat's loving it… #AUSvIND pic.twitter.com/JV0lxo4Aen
— cricket.com.au (@cricketcomau) December 8, 2018
మూడో రోజు ఆట ప్రారంభించడానికి ముందు వర్షం పడింది. దీంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం తగ్గిన తర్వాత అందరూ తిరిగి మైదానంలోకి చేరుకున్నారు. ఆట ప్రారంభం కాబోతుండగా కోహ్లి ఓ చోట నిలబడి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్విటర్లో పంచుకుంది. దాంతో ఈ వీడియో వైరల్గా మారింది.