బాలీవుడ్ తారలు ఇర్ఫాన్, అనిల్కపూర్, ప్రియాంక చోప్రా, దీపిక పడుకొనే, ఓంపురి,సోనూసూద్, గుల్షన్గ్రోవర్ తరువాత హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న నటుడి పట్టికలో ధనుష్ చేరారు.తెలుగు, తమిళం, బాలీవుడ్లో నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఇప్పుడు హాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నాడు.ధనుష్ పాడిన వై దిస్ కొలవెరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు, ఇది యూట్యూబులో అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా నమోదు అయ్యింది.
ఈపుడు ధనుష్ ఇరానీయన్ ఫ్రెంచ్ ఫిలింమేకర్ మర్జానే సత్రాపి దర్శకత్వంలో రూపొందనున్న నటించనున్నాడు, ఈ సినిమా జూన్ 16న స్టార్టవుతుంది. ఈ చిత్రంలో ఉమ థుర్మాన్, శాన్ అండ్రియాస్లతో ధనుష్ కలిసి నటించనున్నాడు. రోమేనియా నవల ది ‘ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ హు గాట్ ట్రాప్డ్ ఇన్ ఎన్ ఇకియా వార్డ్రోబ్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కునుంది. ఇందులో న్యూఢిల్లీ నుండి ఫ్రాన్స్ వరకు ట్రావెల్ చేసే ఫకీర్గా ధనుష్ కనపడనున్నాడు.