ఎలక్షన్ ఫీవర్ నిన్నటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 69.1 శాతం ఓట్లే పోలయ్యాయి.నగరంలో నమోదైన పోలింగ్ శాతంపై సినీ దర్శకుడు కొరటాల శివ మండిపడ్డారు.
“హైదరాబాద్ ప్రజలకు ఏమైంది. మధ్యాహ్నం వరకు కేవలం 35శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 3 గంటల వరకు తక్కువగా ఓట్లశాతం నమోదైంది. నగర ఓటర్లకు సిగ్గు అనిపించడం లేదా?” అంటూ కొరటాల శివ ట్వీట్ చేసారు.
What’s happening to hyderabad. 35 percent polling till 3 o clock. Shame on the urban voter. #TelanganaAssemblyElections
— koratala siva (@sivakoratala) December 7, 2018
చాంద్రాయణ గుట్ట, నాంపల్లిలో అయితే పోలింగ్ బూత్లు బోసిపోయి కనిపించాయి. గత ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో పోలింగ్ 50 శాతానికి మించలేదు. ఈసారి నగర పోలింగ్ శాతాన్ని పెంచాలని అధికారులు శతవిధాల ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడం. పోలింగ్ బూత్ల అయోమయం ఓటింగ్పై ప్రభావం చూపినట్లు స్పష్టం అవుతోంది.