Home / Entertainment / కుమారి నీ చూసి సెన్సార్ సభ్యుల దిమ్మ తిరిగింది.

కుమారి నీ చూసి సెన్సార్ సభ్యుల దిమ్మ తిరిగింది.

Author:

kumari 21f Movie poster

‘కుమారి 21 F’ ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే సినిమా గూరించి మాట్లాడుకుంటున్నారు.అందుకు కారణం సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే చిత్రానికి తన శిష్యుడు కరేంట్ ఫేం సూర్య ప్రతాప్ డైరేక్షన్ వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం రాజ్ తరుణ్ హీరోగా హేభ పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రఫి,సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించాడు..ఈ సినిమా టీజర్ ను NTR విడుదల చేశాడు. ఈ చిత్రం యొక్క ఆడియో అల్లు అర్జున్ విడుదల చేయగా, ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం చాలా మంది పాలుపంచుకుంన్నారు.అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ రిపోర్ట్ కోసం వచ్చిన ఈ చిత్రాన్ని చూసి సెన్సార్ సభ్యులు షాక్ కి గురయ్యారు.

గత కొన్ని రోజులుగా ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్ అని చెప్తూ వస్తున్న ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న ముద్దు సన్నివేశాలు, బెడ్ పై చేసే రొమాన్స్ సన్నివేశాలు, ఇతర రొమాంటిక్ సన్నివేశాలను చూసి సెన్సార్ సభ్యుల దిమ్మ తిరిగిందని తెలుస్తుంది. వెంటనే ఆ చిత్రంలోని బెడ్ సన్నివేశాలు కట్ చేసి, కొన్ని డైలాగులకు బీప్ శభ్దాన్ని పెట్టేసి సినిమాకి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో లేనివిధంగా ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(Visited 278 times, 1 visits today)