దర్శకత్వం లో తనకంటూ ఉన్న గుర్తింపు ఇక చాలనుకున్నాడేమో.. దర్శకుడు సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’తో నిర్మాతగా కూడా మారారు.ఈ ప్రేమకథా చిత్రానికి సుకుమార్ స్వయంగా కథ, స్క్రీన్ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు. ఉయ్యాల జంపాలా,సినిమా చూపిస్త మామా సినిమాల హీరో రాజ్ తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ నెలాఖరు లో రానుంది.
సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తిచేసుకుంది. నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి.అని అన్నారు.. కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే అంశం చుట్టూ తిరిగే కథని సుకుమార్ తన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు…
క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన టీజర్కు చక్కని స్పందన వస్తోంది. ఈ నెలలోనే పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
కుమారి గా హేభ పటేల్ నటిస్తూండగా రాజ్ తరుణ్ హీరో.. ఇంకా నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.