పల్లెల్లో ఇప్పటికి చాలా మంది మహిళలు బహిర్బుమికి ఊరి చివరకు వెళ్తుంటారు. అలా వెళ్ళడం వలన చాలా మంది మహిళలు అత్యాచారాలకు బలైపోతున్నారు. ఈ విషయంలో చాలా మంది మహిళల మానప్రాణాలు పోతున్నా, ప్రజలలో చైతన్యం మాత్రం రావడం లేదు. చాలా పల్లెల్లో వయసుకు వచ్చిన అమ్మాయిలు బహిర్బుమికి వెళ్తున్న సమయంలో వారిపై కన్నేసిన వారు అదే అదునుగా భావించి ఆ సమయంలో అక్కడికి ఎవరు రారు కాబట్టి అమ్మాయిలపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగడుతున్నారు. ఈ మధ్యా జరిగిన అనేక సంఘటనలలో ఎక్కువగా పల్లెల్లో మహిళలపై బహిర్బుమికి వెళ్ళిన సమాయంలో జరిగినవే.
పల్లెల్లో ప్రభుత్వ పథకాలు ఎన్ని ప్రవేశపెట్టిన వాటి గురించి ప్రజలకు ఎక్కువగా తెలియకపోవడం వలన ఆ పథకాల ఫలితాలు వారికి అందడం లేదనేది సత్యం. పల్లె ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి నిర్మించాలీ అని కచ్చిత నిర్ణయాలు తీసుకుంటున్నా, దిగువ స్థాయిలో అనుకున్నంత సజావుగా పనులు జరగటం లేదు అనేది అందరికి తెలిసిన నిజం. ఈ విషయంపై చాలా ప్రభుత్వాలు చాలా ఏళ్ళు గా ఎంతోగాను ప్రచారం చేసిన ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పథకం నిర్మల్ భారత్ అభియాన్కు తాజాగా గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని జోడించారు. గతంలో రూ.3000లు చొప్పున ఇచ్చింది దానితో నిరుపేదలపై అధికంగా ఆర్థిక ప్రభావం పడటంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం మరో పథకం ఎన్ఆర్ఇజీఎస్ ద్వారా మొత్తం ఒక్కొక్క వ్యక్తిగత నిర్మాణానికి రూ.10వేలు చెల్లించేందుకు ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని చేస్తున్న అనుకున్న పథకాలు నీరుగారుతున్నవి.
కొన్ని ప్రాంతాలలో చాలా వరకు 100% మరుదొడ్డి నిర్మాణం జరిగి బహిర్బుమి ని నిషేదించారు. ఉదా… హరీష్ రావ్ నియోజక వర్గంలో చాలా పల్లెల్లో ఇది అమలు జరిగింది. ప్రభుత్వమే వచ్చి అన్ని చేస్తది అని కూర్చుంటే పోయేది మన ఇంటి మానప్రాణలే అని తెలుసుకోవాలి అందుకే కచ్చితంగా ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉందే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇటు పల్లెను ఆరోగ్యంగా ఉంచుతూ మీరు ఆరోగ్యంగా ఉండండి.