స్నేక్ గ్యాంగ్ ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు ఉల్కిపడుతాయి. దానికి కారణం ఈ విషనాగులు చేసిన ఆకృత్యాలు అంత ఇంత కాదు. స్నేక్స్ తో భయపెట్టి యువతులపై అత్యాచారాలు చేయడం..డబ్బులు,నగలు దోచుకోవడం.. ఎదురుతిరిగిన వారిని చంపివేయాడం వీరి పని. ఇలా చాలా మంది యువతి జీవితాలతో ఆడుకున్న ఈ విషనాగులకు కోరలు తీసింది రంగారెడ్డి కోర్ట్. వీరికి జీవిత ఖైది శిక్ష విదిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో మొత్తం 9మంది అందులో A1 నుంచి A 8 వరకు.. 8 మందిని దోషులుగా తేల్చింది. A9పై నమోదైన కేసును నిన్న కొట్టేసిన విషయం మనకు తెలిసిందే, అయితే ఈ రోజు ఈ 8మందిలో A1నుండి A7వరకు జీవిత ఖైదీలుగా A8 కి మాత్రం తనకు 65 ఏళ్ల వయస్సు ఉందని, తనకు న్యాయం చేయాలని కోరిన నేపథ్యంలో A8 నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది.వీరికి పడిన శిక్ష ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, అక్రమంగా ఇంట్లోకి చొరబడి ఆబరణాలు దోచుకెళ్లడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ స్నేక్ గ్యాంగ్ చేసిన నేరాలు అన్ని ఇన్ని కావు ఇందులో చాలా మందిపై అత్యాచారం కూడా చేశారు కానీ వీరికి అత్యాచారం కేసు కింద శిక్షలు వేయకపోవడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బాధితులకు సరైన న్యాయం జరగలేదంటున్నాయి. దాదాపు 37 జంటలపై దాడులకు దిగిన స్నేక్ గ్యాంగ్ పై కనీసం ఒక్క అత్యాచార ఘటనని కూడా పోలీసులు నిరూపించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.