Home / Entertainment / మీ కోసం ‘క్షణం’ వస్తామంటున్న మహేష్, సమంత.

మీ కోసం ‘క్షణం’ వస్తామంటున్న మహేష్, సమంత.

Author:

Mahesh Babu and Samantha

అడవి శేషు, అదాశర్మ జంటగా అనసూయ భరద్వాజ్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క్షణం’. పివిపి సంస్థ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్నఈ చిత్రానికి రవికాంత్ పెరేపు దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఫిబ్రవరి 10 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు.

ఈసినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్, సమంతల చేతుల మీదుగా ఫిభ్రవరి 10న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

(Visited 66 times, 1 visits today)