అడవి శేషు, అదాశర్మ జంటగా అనసూయ భరద్వాజ్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క్షణం’. పివిపి సంస్థ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్నఈ చిత్రానికి రవికాంత్ పెరేపు దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఫిబ్రవరి 10 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు.
ఈసినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్, సమంతల చేతుల మీదుగా ఫిభ్రవరి 10న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.