Home / Entertainment / అభాగ్యులకు అండగా ‘మెముసైతం’ అంటున్న మహేష్, ఎన్.టి.ఆర్

అభాగ్యులకు అండగా ‘మెముసైతం’ అంటున్న మహేష్, ఎన్.టి.ఆర్

Author:

mahesh-babu-ntr-to-follow-rakul-akhil-rana
‘మేము సైతం’ అంటు హుదూద్ తుఫాన్ వల్ల నష్టపోయిన బాదితుల కోసం తెలుగు చిత్ర సీమ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాంని నిర్వహించి బాధితులకు అండగా నిలిచింది. ఈ ప్రోగాం ద్వారా వచ్చిన డబ్బుతో బాధితులకు నివాస మరియు ఆర్థిక పరంగా ఆదుకుంది. ఇప్పుడు ఓ టీవీ చానల్ ‘మేము సైతం’ అంటు రియాలిటీ షో చేయనుంది. త్వరలోనే ఈ ప్రోగ్రాం మొదలు కానుంది. దినికి లక్ష్మీ మంచు హోస్ట్ గా చేయనున్న విషయం మనకు తెలిసిందే. ఈ షో ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని ఆర్ధికంగా చతికిల పడి వైధ్యానికి డబ్బు లేని వారికి మరియు సునామీ, తుఫాన్, వరదలు మొదలైన ప్రకృతి విలయాల వల్ల దెబ్బతిన్న వారికి సాయం చేయడానికి ఉపయోగించనున్నారు.

ఈ ప్రోగాంని జనాల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో లక్ష్మీ మంచు టాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్, సెలబ్రిటిలను అందరిని సపోర్ట్ ఇవ్వమని అడుగడంతో వారందరు మేముసైతం అంటు జన సందోహంలోకి వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మగా, రానా దగ్గుబాటి ఓ కూలీలా మారి కూరగాయల మార్కెట్ లో మూటలు మోసాడు. అలాగే అఖిల్ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు వీరి జాబితాలో సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరోస్ మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లు కూడా జాయిన్ కానున్నారు. మేముసైతం ని ప్రమోట్ చేయడం కోసం జన సందోహం మధ్యలోకి వచ్చి అభాగ్యులకు అండగా ‘మేముసైతం’ అంటు వస్తున్న మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లకు మా హ్యాట్సాఫ్.

(Visited 408 times, 1 visits today)